Friday, May 3, 2024

Shankarpalli: కాళీమాత ఆలయంలో చోరీ

రంగారెడ్డి : శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ కాళీమాత ఆలయంలో దొంగతనం జరిగింది. పూజారి, పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. పూజారి రామచంద్రయ్య చేసిన ఫిర్యాదు మేరకు శంకర్ పల్లి పోలీసులు ఆలయ ప్రాంగణంలో పగులగొట్టిన హుండీని దగ్గర ఉండి పరిశీలించారు. దాదాపు 30వేల రూపాయల వరకు నగదు ఉండవచ్చని పూజారి అంచనా వేశారు. గత కొన్ని రోజుల నుండి హుండీ లెక్కించలేదని ఆయన పేర్కొన్నారు. శంకరపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement