Friday, May 3, 2024

ఢిల్లీ బిఆర్ఎస్ కార్యాల‌యం వ‌ద్ద శేజ‌ల్ ఆమ‌ర‌ణ దీక్ష‌..

న్యూఢిల్లీ – బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తున్న ఆరిజిన్ డైరీ సంస్థ నిర్వాహకురాలు శేజల్ దేశ రాజధాని ఢిల్లీలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గత కొద్ది రోజులుగా ప్రతిరోజు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపడుతున్న శేజల్ ఇప్ప‌టి వ‌ర‌కు దుర్గం చిన్నయ్య పై ఎటువంటి చర్యలు తీసుకోక‌పోవ‌డంతో నేడు ఆమరణ నిరాహార దీక్ష చేప‌ట్టారు.. .

ఇప్ప‌టికే ఎమ్మెల్యే పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ శేజ‌ల్ సిబిఐ, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు చిన్నయ్య పై ఫిర్యాదు చేశారు.. అలాగే తెలంగాణ డిజిపి కి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి 14 రోజులైనా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేసింది. ఆడపిల్లల వైపు అసభ్యంగా చూస్తే గుడ్లు పీకుతానన్న కేసీఆర్ తన ఆవేదనని అర్థం చేసుకోవడం లేదని, ఇప్ప‌టికైనా తెలంగాణ ముఖ్య‌మంత్రి జోక్యం చేసుకుని త‌న‌కు త‌గిన న్యాయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement