Saturday, May 11, 2024

శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచణం చేయగా ఆలయ అర్చకులు శాలువాతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. గణనాథుని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ ఎం బాలరెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు జగన్, ఎం. సత్యనారాయణ, నాయకులు సురేష్ రెడ్డీ, బాలకృష్ణ రెడ్డి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement