Monday, May 20, 2024

పంచాయతీ కార్మికుల భిక్షాటన

యాచారం, జూలై16(ప్రభన్యూస్): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 11 రోజులుగా పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నంది వనపర్తి గ్రామంలో పంచాయతీ సిబ్బంది గ్రామంలో భిక్షాటన చేస్తున్నారు. కెసిఆర్ ప్రభుత్వం పంచాయతీ కార్మికులను బిక్షం ఎత్తుకునేలా చేసిందని పంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి పనులు చేయించుకొని ప్రస్తుతం వారు చేస్తున్న సమ్మెను పట్టించుకోకుండా వారి న్యాయమైన డిమాండ్లను అంగీకరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వారి న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చి వారికి న్యాయం చేయకపోతే రాబోవు రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement