Thursday, May 2, 2024

జిల్లాకు రూ.80కోట్లు విడుదల… సీఎంకు ధన్యవాదాలు : సబితారెడ్డి

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా నియోజకవర్గానికి రూ.10 కోట్ల నిధులు విడుదల చేయటం పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేసారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల అభివృద్ధికి రూ.80 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు జిల్లా ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఆర్థికశాఖ నిధులు విడుదల చేస్తూ జీఓను జారీ చేసింది. ఇబ్రహీం పట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్ నగర్, కల్వకుర్తి, ఎల్ బి నగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు రూ.10 కోట్ల చొప్పన నిధులు విడుదలయ్యాయని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement