Monday, May 6, 2024

నీటి స‌మ‌స్య‌ ప‌రిష్క‌రించాల‌ని విన‌తి

నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఇంద్రన్న కాలనీలో ఈరోజు నీళ్ల సమస్యలపై ఇంద్రన్న కాలనీ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో డిజియం సరితా కు, మేనేజర్ సాయిరామ్ రెడ్డి కి వినతిపత్రాలు అంద‌జేశారు. అనంతరం కాలనీ అధ్యక్షులు పాలబిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ… కాలనీలో వాటర్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. అలాగే పైపు లైన్ లో అవకతవకలున్నాయన్నారు. అందరికీ సమానంగా నీళ్లు రాకుండా ఒకచోట ఎక్కువగా.. మరొక చోట తక్కువగా నీళ్లు వస్తున్నాయన్నారు. ఇప్పటికైనా సమపాళ్ల‌లో నీటి పంపిణీ జ‌ర‌గాల‌న్నారు. ఆలాగే త‌మ బాధలు అర్థం చేసుకొని పైపులైన్లు, అలాగే వాల్స్ మార్చాల‌ని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నాగేష్, శేఖర్, బాలకృష్ణ, కోశాధికారి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement