Sunday, May 19, 2024

తాగుబోతోళ్ల కష్టం మీకే బాగా తెలుసు: సీఎం కేసీఆర్ పై షర్మల సెటైర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై మరోసారి వైసీఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల విమర్శలు గుప్పించారు. రైతుల కడుపు కొట్టి, బడులను బంద్ పెట్టి, బార్లకు “రండి బాబు .. రండి” అంటూ డోర్లు తెరుస్తున్నాడని మండిపడ్డారు. దీనిపై సీఎం కేసీఆర్‌ సిగ్గుపడాలన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి… ఇంటికో తాగుబోతుని తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం పెంచుకొనే తెలివి లేక లిక్కర్ మీద రాష్ట్రాన్ని నడుపుతున్నందుకు నిజంగా సిగ్గుపడాలన్నారు.

”తాగుబోతోళ్ళ కష్టం మీకే బాగా తెలుసినట్లు.. గల్లీకో వైన్ షాప్, వీధికో బార్ షాప్, గ్రామానికో 10 బెల్ట్ షాపులు పెట్టి బంగారు తెలంగాణను బారుల తెలంగాణగా, బీరుల తెలంగాణగా మార్చారు దొరగారు. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి లిక్కర్ షాపులను పెంచడంలో డ్రగ్స్ అమ్మడంలో మాత్రమే కనిపిస్తుంది” అంటూ వైఎస్‌ షర్మిల ఫైర్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement