Monday, April 29, 2024

RR: కేసీఆర్ కు లంచం ఇస్తేనే… పర్మినెంట్ చేస్తారు… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ

వికారాబాద్, సెప్టెంబర్ 16 (ప్రభ న్యూస్); ప్రతి విషయానికి లంచం తీసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్, అంగన్వాడీలు పర్మినెంట్ కావాలంటే తప్పనిసరిగా లంచం ఇవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న అంగన్వాడీల ఆరో రోజు దీక్షకు ఆయన మద్దతు పలికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ప్రతి చిన్న విషయానికి లంచం లేనిది పనిచేయడం లేదని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షుడు క్రాంతి కుమార్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు మైపాల్, అంగన్వాడీ టీచర్ల యూనియన్ అధ్యక్షురాలు భారతి మనోహర, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement