Thursday, May 2, 2024

సిఎం రిలిఫ్‌ ఫండ్‌ చెక్కులు పంపిణి

యాచారం : యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన బాధితులకు ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్‌ రెడ్డి చేతుల మీదుగా సిఎం రిలిఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డికిషన్‌ రెడ్డి గారు నిరుపేద ప్రజలకు అండగా ఉంటూ పేదలకు కూడ కార్పోరేట్‌ స్థాయిలో వైద్యం అందించేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పార్టీలకతీతంగా అర్హులైన పేద ప్రజలందరికి సిఎం రిలిఫ్‌ ఫండ్‌ చెక్కులను బాధితులకు అందిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా మేడిపల్లి గ్రామానికి చెందిన యాదయ్యకు రూ. 60వేలు, శేఖర్‌ రూ. 38వేలు, శ్రీకాంత్‌ రూ. 30వేల చొప్పున సిఎం రిలిఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి భాషా, ఎంపిటిసి శివలిలా రమేష్‌, మాజీ ఎంపిటిసి శ్రీశైలం, మొండిగౌరెల్లి గ్రామ సర్పంచ్‌ బండిమిది కృష్ణ, యాచారం మాజీ సర్పంచ్‌ మారోజు కళమ్మ శ్రీనివాస్‌ చారీ, తెరాస నేతలు ఒరుగంటి యాదయ్య, వెంకట్‌, దాసు, కాశమల్ల శివ, సురేష్‌, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement