Wednesday, May 15, 2024

అర్అర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అర్ అర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పూడురు మండల పరిధిలో చేనుగోముల్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి మంచి స్పందన వచ్చింది. మన ఊరు – మన ఆరోగ్యం పేరుతో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మెన్, చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి ఆదేశానుసారం పరిగి నియోజకవర్గ పరిధిలో పూడూరు మండల పరిధిలో గల చేనుగోముల్ లో RR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ… అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు.

ఎంపీ రంజిత్ రెడ్డి ప్రతి గ్రామంలో ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారన్నారు. చాలా మందికి వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందచేస్తున్నందుకు ఎంపీ రంజిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం తమ మండలంలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఉచిత వైద్య శిబిరంలో రక్త పరీక్షలు కూడా చేశారు. అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు ఉచితంగా మందులు పంపిణీ, వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో RR ఫౌండేషన్ బృందం, వైద్య కళాశాల DGM సుమన్, వైద్య బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement