Tuesday, May 7, 2024

Yalala: రోడ్లకు ఇరువైపులా గ్రావెల్ వేయండి.. సునితమ్మ ఆదేశం

యాలాల: యాలాల మండలంలోని పగిడ్యాల్ నుంచి కమలాపూర్ వరకు ఆర్ అండ్ బీ రోడ్డు దుస్థితి అధ్వాన్నంగా తయారైనా మరమ్మత్తులు కూడా చేయరా ? అంటూ ఆర్ అండ్ బీ అధికారులను జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి ప్రశ్నించారు. రోడ్డుకు ఇరువైపులా కోతకు గురై వాహనదారులు ప్రమాదాలకు గురువుతున్నారన్నారు. మంగళవారం అదే రోడ్డు మీద ప్రయాణం చేసిన సునీతారెడ్డి తన కారు ఆపి రోడ్డును పరిశీలించారు. రోడ్డు వేసిన సమయంలోనే ఇరువైపులా గ్రావెల్ వేసేలా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. పగిడ్యాల్ కమల్ పూర్ రోడ్డుకు ఇరువైపులా వెంటనే గ్రావెల్ వేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement