Sunday, April 28, 2024

కోదండ రామాలయ నూతన ముఖ ద్వారా ఆవిష్కరణ

  • హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ ప్రసూనా నగర్ లోని శ్రీ కోదండ రామాలయ నూతన ముఖ ద్వారా ఆవిష్కరణ, కుంభాభిషేక మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఘన శ్రీశైలం గౌడ్ కు స్వాగతం పలికి శాలువా కప్పి ఆయన్ను సత్కరించారు. ఈ సందర్బంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఆలయ ముఖద్వారం, కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరి పైన స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement