Friday, May 3, 2024

RangaReddy | కరుణాకర్ రెడ్డి దారుణ హత్య.. రాత్రి కిడ్నాప్​ చేసి చంపేశారు

రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డిని నిన్న సాయంత్రం సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. ఇవ్వాల అతను హత్యకు గురైనట్టు గ్రామస్తులు తెలిపారు. కొత్తూరు మండల ప్రజా ప్రతినిధిగా ఉన్న పిన్నింటి మధుసూదన్ రెడ్డి సోదరులు పిన్నింటి విక్రం రెడ్డి, పిన్నింటి విక్రం వి రెడ్డి, పిన్నింటి విష్ణువర్ధన్ రెడ్డి, డ్రైవర్ ఆరిఫ్ మరో వ్యక్తి అరుణ్ కుమార్ రెడ్డి ఈ నలుగురు కలిసి నిన్న కిడ్నాప్ చేసినట్టు సమాచారం. అయితే.. కిడ్నాప్ చేసిన నిందితులు పిన్నింటి విక్రమ్ రెడ్డి, పిన్నింటి విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు కరుణాకర్ రెడ్డికీ స్వయాన బంధువులేనని సమాచారం.

ఇరువర్గాల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో కరుణాకర్ రెడ్డి, కిడ్నాప్, హత్యకు గురికావడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నిందితులు మండల స్థాయి ప్రజాప్రతినిధి సోదరులు అదేవిధంగా డ్రైవర్ మరొకరు ఈ తతంగంలో పాలుపంచుకోవడంతో మండల ప్రజా ప్రతినిధి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు నిన్నటి నుండి ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషయమై సీఐ బాలరాజ్ వివరణ కోరగా కిడ్నాప్ విషయాన్ని రాత్రి మీడియాకు ధ్రువీకరించారు.

అయితే పోలీసులు అన్ని రూట్లలో నిఘా పెట్టారు.. అతని ఆచూకీ కనుగొనే లోపే కరుణాకర్ రెడ్డి హత్యకు గురయ్యాడు అన్న సమాచారం సంచలనం రేపుతుంది. కరుణాకర్ రెడ్డి గతంలో వెలుగు దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేశాడు. అదేవిధంగా ప్రస్తుతం డాక్యుమెంట్ రైటర్ గా కొత్తూరు మండల కేంద్రంలో పనిచేస్తున్నాడు. గతంలో ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతర్గత విభేదాలు కుమ్ములాటలతో మల్లాపూర్ గ్రామంలో ఇరువురికి ఒకరి కంటే ఒకరు పడడం లేదని తెలుస్తోంది. పథకం ప్రకారం కరుణాకర్ రెడ్డిని హత్య చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement