Wednesday, May 8, 2024

జార్జిరెడ్డి సేవలు మరవలేనివి..

సుభాష్‌నగర్‌ : జార్జిరెడ్డి సేవలు మరువలేనివని పి. జగన్మోహన్‌రెడ్డి అన్నారు. జార్జిరెడ్డి వర్థంతి సందర్బంగా సుభాష్‌నగర్‌ డివిజన్‌ సాయిబాబానగర్‌ చౌరస్తాలో ఆయన చితప్రటానికి పూలమాలల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పి. జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ నేటి యువత జార్జిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. యువతను ఒక తాటిపైకి తెచ్చి ఉద్యమాలను నడిపిన మహానీయుడు ఉస్మానియా యూనివర్శిటీలో ఆయన మరణించడం తీరని లోటని.. ఓ మంచి నీయకుడిని కోల్పొయామన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌస్‌ గుండప్ప, ఎండీ ఆసీస్‌ మస్తాన్‌, బురాన్‌ చాంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement