Friday, March 29, 2024

జీవో నంబర్‌ 45 వెంటనే అమలు చేయండి..

సిద్దిపేట : ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల విద్యా వాలంటరీల కుటుంబాల రోడ్డున పడ్డాయని.. అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు విద్యా వాలంటరీ సంఘం నాయకులు. విద్యా వాలంటరీ ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్‌ 45ను అమలు చేసి కరోనా కాల సమయానికి విద్యా వాలంటరీలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా విద్యా వాలంటరి సంఘం తరపున జిల్లా విద్యాశాఖా అధికారి కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంఘ సభ్యులు ఆకుల మహేష్‌, మహేందర్‌ రావు ,చిట్యాల నరేష్‌,మహమ్మద్‌ వజిత్,‌ మహదేవ్‌ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement