Tuesday, May 14, 2024

ఫ‌ర్నీచ‌ర్ గోదాంలో భారీ అగ్నిప్ర‌మాదం.. రూ.8కోట్ల ఆస్తిన‌ష్టం..

ఫ‌ర్నీచ‌ర్ గోదాంలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓంకార్ నగర్‌లోని ఓ ఫర్నిచర్ షాప్‌లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సిబ్బంది రెండు అగ్నిమాపక వాహనాలతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈప్ర‌మాంలో రూ.8కోట్ల విలువైన ఆస్తిన‌ష్టం జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఘటన ప్రాంతమంతా దట్టమైన పొగతో అలుముకుంది. ఫర్నీచర్‌ షాప్‌ సమీపంలో పెట్రోల్‌ బంక్‌ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement