Monday, May 6, 2024

Breaking: ఉరి వేసుకుని తండ్రి కొడుకు ఆత్మహత్య

తండ్రీ కొడుకు ఉరివేసుకొని మృతిచెందిన విషాధ ఘ‌ట‌న తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని షాద్ నగర్ పరిధిలోని చౌదర్ గూడ మండలం జాకారం గ్రామంలో అప్పుల బాధ, భూ సమస్యలతో ఉగ్గీ అంజయ్య అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందగా, తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కుమారుడు ప్రవీణ్ కూడా ఉరి వేసుకుని మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement