Friday, April 26, 2024

శ్రీశైలం హైవేను 4లేన్లుగా విస్తరించండి : నితిన్ గడ్కరీకి ఎంపీ వినతి

శ్రీశైలం హైవేను 4లేన్ల రహదారిగా విస్తరించాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు. తన చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని జల్ పల్లి మునిసిపాలిటీ, పహాడి షరీఫ్ ప్రాంతాలు హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే మార్గమధ్యలోకి వస్తాయన్నారు. ఈ రోడ్డు ఇరుకుగా వుండటం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా ఈ రోడ్డును 4 వరుసల జాతీయ రహదారిగా చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement