Thursday, April 25, 2024

ఏపీ అభివృద్ధి కళ్లారా చూసి తెలుసుకో: కేటీఆర్ కు ఏపీ మంత్రి సవాల్

ఏపీలో కరెంట్, నీళ్లు సరిగ్గా లేవంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లాగానే కేటీఆర్ కూడా కాకమ్మ, పిట్ట కథలు చెబుతున్నారని విమర్శించారు. విజయవాడ వచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందన్నారు. ఏపీ అభివృద్ధిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు. వాలంటీర్లతో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు.

ఏపీలో తాగు, సాగు నీటి సమస్య లేనే లేదని స్పష్టం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే.. అమ్మ ఒడి, ఆసరా కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్లు కట్టించే పట్టణాల నిర్మాణం కనిపిస్తుందని చెప్పారు. ప్రతి గ్రామంలో సచివాలయం, డిజిటల్ లైబ్రరీ కనిపిస్తుందన్నారు. సచివాలయ వ్యవస్థ బాగుందని తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మెచ్చుకున్నారని గుర్తు చేశారు. దేశంలోని ఏ సీఎం కూడా చేయని అభివృద్ధి పనులను జగన్ చేశారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement