Monday, April 29, 2024

RR: మైనార్టీల అభివృద్ధికి నిరంతరం కృషి.. ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, సెప్టెంబర్ 8 (ప్రభ న్యూస్): ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మైనార్టీ బంధు కార్యక్రమం చేపట్టి మైనార్టీలకు లక్ష 16 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన మైనార్టీ బంధు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎంపీడీవో సత్తయ్య, ఎంపీపీ చంద్రకళ, కమాల్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు సిరాజుద్దీన్, నాయకులు సత్య గౌడ్, శివకుమార్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కమాన్ రెడ్డి, సర్పంచ్ చంద్రమౌళి, మర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement