Saturday, May 4, 2024

సుభాన్ రెడ్డి హాస్పటల్ ఖర్చులు నేనే భరిస్తా.. ఎంపీ రంజిత్ రెడ్డి

వికారాబాద్ (ప్రభ న్యూస్): ఆపద వచ్చిందని కార్యకర్తలేవరూ అదైర్య పడొద్దని, వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చేవెళ్ల ఎంపీ డాక్టర్. జి. రంజిత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ లో యాక్సిడెంట్ కు గురై, సికింద్రబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికారాబాద్ మున్సిపాలిటీ యువ నాయకులు సుభాన్ రెడ్డిని చేవెళ్ల ఎంపీ. డాక్టర్. జి. రంజిత్ రెడ్డి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వైద్యుల ద్వారా అతనికి అందుతున్న చికిత్స పై ఆరా తీశారు. అతని కుటుంబ సభ్యులను కలిసి, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సుభాన్ వైద్య ఖర్చులకయ్యే 8 లక్షల రూపాయల మొత్తాన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఆపద వచ్చిందని కార్యకర్తలేవరూ అదైర్య పడొద్దని, తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement