Wednesday, May 15, 2024

కేసీఅర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ లోకి : మంత్రి మల్లారెడ్డి

సీఎం కేసీఅర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీ నాయకులు తెరాస పార్టీలో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మూడుచింతలపల్లి మండలం నారాయణపూర్ గ్రామంలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీజేపీ నుండి గ్రామ ఉప సర్పంచ్ హన్మంతు, జె బాబు వార్డ్ మెంబెర్, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుండి కవిత కాంగ్రెస్ పార్టీ మహిళా జన‌ర‌ల్ సెక్రటరీ, టి.నాగరాజు, కాంగ్రెస్, బీజేపీ పార్టీల‌ కార్యకర్తలు దాదాపు 50మంది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వారికి కడువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు మంత్రి మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం తెరాస పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, ఎంపీపీ హారిక మురళి గౌడ్, సర్పంచ్ రాంచంద్రయ్య, నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement