Sunday, May 19, 2024

మోత్కూర్ ఎక్సైజ్ సర్కిల్లో 651 దరఖాస్తులు.. అర్రురు వైన్స్ కు అత్యధికంగా 83 దరఖాస్తులు

మోత్కూర్, (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని 5 మండలాల్లోని 15 వైన్స్ లకు గాను శుక్రవారం సాయంత్రం దరఖాస్తుల చివరి రోజు నాటికి 651 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సిఐ సిహెచ్ చంద్రశేఖర్ విలేకరులకు తెలిపారు.గురువారం నాటికి 436 దరఖాస్తు లు రాగా, చివరి రోజు ఒక్క రోజే 215 దరఖాస్తులు పడ్డాయి.

సర్కిల్ పరిధిలోని వలిగొండ మండలం అరూరు వైన్స్ కు అత్యధికంగా 83 దరఖాస్తులు రాగా, మోత్కూర్ లో 4 వైన్స్ లకు 136, అడ్డగూడూరు 2 వైన్స్లకు 78 ,ఆత్మకూరు లో 2 వైన్స్ లకు 102, వలిగొండ లో 4 వైన్స్ లకు 171 ,గుండాల లో 2 వైన్స్ లకు 81 చొప్పున మొత్తం 651 దరఖాస్తులు దాఖలైనట్లు సిఐ తెలిపారు.సర్కిల్ పరిధిలో టెండర్ల రూపేణా 13 కోట్ల 2 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement