Monday, April 29, 2024

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న బైక్ – దంప‌తులు దుర్మ‌ర‌ణం…

రంగారెడ్డి జిల్లాలోని జూపాల శివారులో జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదం దంప‌తులు దుర్మ‌ర‌ణం చెందారు… దంప‌తులు వెళుతున్న‌ బైక్‌ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న భార్యభర్తలు ఇద్దరూ మృతిచెందారు. మృతుల‌ను మంచాల మండలం బోడకొండ తండాకు చెందిన ల‌క్ష్మ‌ణ్‌, మంగగా గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement