Wednesday, May 15, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

శంషాబాద్ : పెద్దషాపూర్‌ జాతీయ రహదారిపై బైక్‌ యూటర్న్‌ చేసుకునే సమయంలో రోడ్డు ప్రమాదంలో ఢీ కోట్టిన ఆర్టీసి బస్సు వ్యక్తి మృతి చెందిన సంఘటన శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చోటుచేసుకుంది. శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ సిఐ ప్రకాష్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్‌ నుండి అమీర్‌ పేట్‌ వెళుతున్న ఆర్టీసి బస్సు పెద్దషాపూర్‌ వద్ద యూటర్ప్‌ తీసుకుంటుండగా వెనకాల నుండి బైక్‌ పై వచ్చిన చాకలి ఆనంద్‌ను బస్సు ఢీ కోట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మహేశ్వరం మండలంలోని అమీర్‌ పేట్‌ గ్రామానికి చెందిన వారిగా గుర్తించి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ సంస్ధలో డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తునట్లు పోలీసులు తెలిపారు. వెంటనే క్షతగాత్రులను ఉస్మానియ హస్పటల్‌కు తరలించిన పోలీసులు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement