Saturday, April 27, 2024

TS : రాయికల్ టోల్ ప్లాజా వద్ద రూ. 16.5 లక్షలు, 5.5కిలోల వెండి స్వాధీనం…

షాద్ నగర్, మార్చి 24 (ప్రభ న్యూస్) : మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో పోలీసులు భారీగా తనిఖీలు చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున పట్టణ సిఐ ప్రతాప్ లింగం ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలలో భాగంగా వనపర్తి నుండి హైదరాబాద్ కు వెళ్తున్న జయదేవ్ అనే వ్యక్తి ఐదున్నర కిలోల వెండి 16 లక్షల 50 వేల రూపాయల నగదుతో పట్టుపడ్డాడు.

తనిఖీలలో భాగంగా తెల్లవారుజామున సిఐ ప్రతాప్ లింగం తదితర సిబ్బంది తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో జయదేవ్ అనే వ్యక్తి నుండి రాయికల్ టోల్ ప్లాజా వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నట్టు మీడియా వివరాలను అడుగగా అధికారి స్పష్టం చేశారు. పోలీసులు నగదు రవాణాపై ఇతర విలువైన వస్తువులపై డేగ కన్నుతో వ్యవహరిస్తున్నారు. వీటిని ఎన్నికల అధికారి ఆర్డీవోకు అందజేయనున్నట్లు సిఐ ప్రతాప్ లింగం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement