Monday, April 29, 2024

రాహుల్ గాంధీయా.. ఆయనెవరు?.. ఎంఐఎం అధినేత ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీయా.. ఆయనెవరు.. మీకు తెలిస్తే కాస్త చెప్పండి.. అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పైన, ఆ పార్టీ యువనేత పైన ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఓ టీవీ చర్చావేదికపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇతర ప్రాంతాలలోనూ కానూ కాంగ్రెస్ ను నిర్మూలించేందుకు యుద్ధమే చేస్తున్నారన్న ఆయన రెండుమూడేళ్లలో కాంగ్రెస్ లో విస్ఫోటనం, విచ్ఛిన్నం తప్పదని జోస్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఎవరో తనకు తెలియదని, మీకెవరికైనా తెలిస్తే కాస్త దయచేసి చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తన ఎంఐఎంపార్టీ బీ టీమ్ అని అటు సమాజ్ వాదీ పార్టీ, బీజేపీ సహా విమర్శిస్తాయని, రాహుల్ గాంధీ కూడా అలాగే తన పార్టీ బీజేపీకి బి టీమ్ అంటుందని అన్నారు. కానీ తాము ఎవరికీ వంతపాడబోమని, సొంతంగానే ఎదుగుతున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement