Monday, April 29, 2024

Ponguleti : ఈనెల 6వరకు ప్రజాపాలన.. పొంగులేటి

ఈనెల 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… ప్రమాణం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు పూనుకున్నామని చెప్పారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల పూర్తికి చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే రెండు హామీలు ప్రజల్లోకి వెళ్లాయన్నారు. ప్రజల ఆరోగ్య సంబంధమైన ఆసుపత్రి ఖర్చులను రూ.10లక్షలకు పెంచామని తెలిపారు. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదని గ్రామాల్లోకి పాలనను తెచ్చామని పొంగులేటి అన్నారు.

గత ఐదేళ్లుగా స్వరాష్ట్రంలో ప్రజల కలలు కల్లలయ్యాయని, 6 71 లక్షల కోట్ల రూపాయల అప్పును తెలంగాణ నెత్తిన పెట్టారని శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పులు తప్పుకాకపోయినా సరియైన రీతిలో ఆ నిదులను సద్వినియోగం చేయలేదని అన్నారు. కేవలం రాచ ఠీవి అనుభవించేందుకే తెలంగాణను వాడుకున్నారని పొంగులేటి కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. విలాసాలు, భోగాలు అనుభవించి ప్రజల సమస్యలను పక్కన పెట్టారని, కాంగ్రెస్ హయాంలో ప్రజల కష్ట, సుఖాలలో పాలుపంచుకుంటామని అన్నారు. గత ప్రభుత్వం తెలంగాణకు సమకూర్చిన ఆస్తులు ప్రగతి భవన్, కూల్చికట్టిన సెక్రటేరియట్లు మాత్రమేనని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకోసం చిత్తశుద్దితో పనిచేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులం కృషి చేస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కిందిస్థాయిలో ఉన్నటువంటి పేదలకు ప్రభుత్వ పథకాలు అందాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం తాపత్రయం అన్నారు. ప్రజాపాలనలో ప్రజలు ఇచ్చే ప్రతి అప్లికేషన్ కంప్యూటరైజ్ చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరిన కోర్కెలన్నింటినీ పూర్తి చేస్తామని అన్నారు.

ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. పొంగులేటి…
అక్రమాలకు పాల్పడితే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తి లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మద్దులపల్లి మార్కెట్ నిర్మాణం పై క్షేత్ర స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… మద్దులపల్లి మార్కెట్ గత ప్రభుత్వంలో మొదలెట్టారన్నారు. గతంలో ఇక్కడ ఉన్న మట్టి కొండలను కరగతీసి సొమ్ము చేసుకున్నారని ప్రజలు చెప్తున్నారన్నారు. తప్పకుండా మార్కెట్ లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నామన్నారు. బాధ్యులైన ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు.

- Advertisement -


ప్రజల రూపాయి ఎక్కడా దుర్వినియోగం కానివ్వమన్నారు. భూముల భోజ్యంపై అనేక దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటన్నింటినీ విచారిస్తున్నామన్నారు. ఇటీవలే ఓ కార్పొరేటర్ అడ్డగోలు వ్యవహారం చేశాడన్నారు. దానిపై కలెక్టర్ విచారణ చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎంతటివారినైనా వదిలే ప్రసక్తి లేదని, ప్రత్యేక విభాగం పెట్టీ కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement