Thursday, May 2, 2024

ఐపీఎస్ లకు పదోన్నతి

తెలంగాణ‌ రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీలో అడిషనల్ డీజీ గా పనిచేస్తున్న 1990 బ్యాచ్ కు చెందిన గోవింద సింగ్ కు, హైదరాబాద్ సిటీ కమిషనర్ గా పనిచేస్తున్న అంజనీ కుమార్ కు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న రవి గుప్తకు డీజీపీ గా పదోన్నతి కల్పిస్తూ ప్రస్తుతం పనిచేస్తున్న స్థానంలోనే కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement