Tuesday, April 30, 2024

ఇంకా ఐదు రోజులే… ప్రొక‌బ‌డ్డీ-8

గ్రామీణ క్రీడగా పేరు తెచ్చుకున్న ప్రొ కబడ్డీ ఆటంటే తెలియని వారుండరు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఎంతో ఇష్టమైన ఆట. 2014లో తొలి సారిగా ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభమైంది. 8 జట్లతో ప్రారంభమైన పీకేఎల్.. ప్రస్తుతం 12 జట్లకు చేరుకున్నది. ఇప్పటి వరకు ప్రో కబడ్డీ లీగ్‌లో 7 సీజన్లు పూర్తయ్యాయి. షెడ్యూల్ ప్రకారం గత ఏడాది జరగాల్సిన పీకేఎల్ సీజన్ 8 కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ ఏడాది సరికొత్తగా డిసెంబర్ 22 నుంచి ప్రోకబడ్డీ లీగ్ ప్రారంభం కానున్నది. బెంగళూరులో తొలి మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ క్ష‌ణం కోసం త‌మ తెలుగు టైటాన్ రెండేళ్లుగా ఎదురుచూస్తోంద‌ని… ఈవిష‌యాన్ని కూ యాప్ లో పోస్ట్ చేసింది తెలుగు టైటాన్ జ‌ట్టు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement