Thursday, May 2, 2024

BJP: కేంద్రం నిధుల‌పై బహిరంగ చ‌ర్చ‌కు సిద్ధం.. బండి సంజ‌య్

బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఆర్టీసీ ఆస్తులు మిగలవని తెలిపారు. ప్రజల పక్షాన యుద్ధం చేస్తున్న తనను ఓడించేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

కేంద్రం సొమ్ములతో మంత్రి గంగుల సోకు చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ క్రమంలో దమ్ముంటే ఆర్వోబీ, స్మార్ట్ సిటీ సహా కేంద్రం నిధులపై బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement