Wednesday, May 1, 2024

Roja : మంత్రి రోజా నుంచి ప్రాణహాని.. పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ ప్రేమ జంట

ఏపీ మంత్రి రోజా నుంచి తమకు ప్రాణహాని ఉందని ఒక ప్రేమ జంట తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించింది. చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరుకు చెందిన జిలానీలు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఇద్దరి మతాలు వేరు కావడంతో ప్రవీణ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. అంతేకాదు ప్రవీణకు పెళ్లి సంబంధాలను చూడటం ప్రారంభించారు. దీంతో, ప్రవీణ ఇంటి నుంచి వెళ్లిపోయి, జిలానీని పెళ్లి చేసుకుంది. అయితే, తమకు రోజా నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు తమకు రక్షణ కల్పించకుండా రోజా ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. తమకు ఏదైనా జరిగితే రోజానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ మేరకు డీజీపీకి వారు ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement