Thursday, May 16, 2024

91వ రోజుకి చేరిన‌ ‘ప్రగతి యాత్ర’..సూరారం కాలనీ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన ఎమ్మెల్యే కెపి వివేకానంద

కుత్బుల్లాపూర్ – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ 91వ రోజు ‘ప్రగతి యాత్ర’లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 – సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ, వి.డి.ఆర్ స్ట్రీట్ మరియు లూయిస్ బ్రెయిలీ వీధిలో పర్యటించారు. ఈ సందర్భంగా పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాగా తమ బస్తీల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించినందుకు కాలనీవాసులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలి ఉన్న చిన్నపాటి పనులను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే మిగిలిన పనుల కోసం వెంటనే వ్యయప్రణాళికలు రూపొందించి వాటిని పూర్తి చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మన్నే రాజు, మాజీ కౌన్సిలర్ బోబ్బా రంగా రావు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోలె శ్రీకాంత్,129 డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు డా. హుస్సేన్, పండరి యాదగిరి, వెంకటస్వామి, తార సింగ్, ప్రభాకర్, రాజ్ కుమార్, రవి, అంజయ్య గౌడ్, నరేందర్, వెంకటేష్ గౌడ్, బైరేష్ గౌడ్, చందు,శివ, ప్రసాద్, శ్రీనివాస్, దొరబాబు, సుబ్రహ్మణ్యం, రాము, సంక్షమే సంఘం నాయకులు, సభ్యులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement