Friday, May 3, 2024

Power Politics – ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు నిరసన సెగ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ కి ప్రతిరోజు కరెంటు మంటల నిరసన సెగ వెంటాడుతూ ఉంది. రామారెడ్డి మండలం కన్నాపూర్ తాండ రైతు వేదికల వద్ద బి ఆర్ ఎస్ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్న కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై సంఘీభావం తెలిపారు. తమ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ను రైతులకు అందిస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రేవంత్ రెడ్డి మూడు గంటలే వ్యవసాయ పంప్ సీట్లకు విద్యుత్ చాలంటూ వ్యాఖ్యాలు చేయడం ఏమిటని ఎమ్మెల్యే మండిపడ్డారు

.దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశం వద్ద చేరుకొని 24 గంటల విద్యుత్ ఎక్కడ ఇస్తున్నారు అంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అరెస్టు చేశారు. అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement