Tuesday, May 21, 2024

జ‌గ‌న్ తో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి భేటి……

తాడేప‌ల్లి – ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. ఏపీ సీఎంతో పొంగులేటి భేటీ ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై ఇద్దరు చర్చించినట్లు సమాచారం .. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాహుల్ గాంధీ సభలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న పొంగులేటి వైసిపి అధినేత జగన్ ను కలవడం విశేషం..

తంలో పొంగులేటి వైసిపి టిక్కెట్ పై పోటీ చేసి ఖ‌మ్మం ఎంపిగా గెలుపొందారు.. ఆ త‌ర్వాత ఆయ‌న ఆ పార్టీకి దూర‌మై బిఆర్ఎస్ లో చేరారు.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇప్ప‌డు హ‌స్తం గూటిలో ఉన్నారు..ఈ నేప‌థ్యంలోజ‌గ‌న్ తో ఆయ‌న భేటి రాజ‌కీయ వ‌ర్గాల‌లో తీవ్ర చ‌ర్చంచ‌నీయంగా మారింది.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు వార్త‌లు విన‌వ‌స్తున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement