Thursday, May 2, 2024

పొంగులేటికి షాక్ … బిఆర్ఎస్ లో చేర‌నున్న ముఖ్య అనుచ‌రుడు తెల్లం వెంక‌ట‌రావు …

భద్రాచలం,ఆగస్ట్ 16(ప్రభ న్యూస్): పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుంగు అనుచరుడు, భద్రాచలం నియోజక వర్గంలో ఆయనకు నమకస్తుడిగా పేరుపడిన డా. తెల్లం వెంకట్రావు పార్టీ మార‌బోతున్నట్లు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పొంగులేటితో పాటు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిశా నిర్దేశంలో నడిచిన ఆయన షాక్ ఇచ్చి రేపు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

2018లో బీఆర్ఎస్ నుంచి భద్రాచలం ఎమ్మెల్యేగా తెల్లం వెంకటరావు పోటీ చేశారు, ఆనాడు తెల్లంకు సీట్ దక్కెందుకు పొంగులేటి కృషి చేశారు. అయితే తాజాగా వెంక‌ట‌రావు కాంగ్రెస్ పార్టీని వీడాల‌ని నిర్ణయించుకున్నారు.. బిఆర్ఎస్ ముఖ్యనేత ఆదేశంతో కొందరు కీలక నేతలు వెంకట్రావు మనసు మార్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బిఆర్ఎస్ నేత‌లు ఇచ్చిన హామీతో వెంక‌ట‌రావు కాంగ్రెస్ కు, అలాగే పొంగులేటి బైబై చెప్పి కారు గూటికి చేర‌నున్న‌ట్లు తెల్లం స‌న్నిహితులు వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement