Wednesday, May 8, 2024

ప్రారంభానికి సిద్ధమైన పోలీస్ స్టేషన్ , తాహసిల్దార్ కార్యాలయాలు

ఖమ్మం : జిల్లాలోని రఘునాధపాలెం మండల కేంద్రంలో శనివారం పోలీస్ స్టేషన్, తహసిల్దార్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. ఈ నేపద్యంలో ప్రాంగణంలో మట్టి తరలించి, రోలర్ , వాటర్ ట్యాంకర్లతో మరమ్మతు పనులకు హెచ్ జి ఐ ఈ ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ సంస్థ సహకారం అందించింది. ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు నిర్వహిస్తున్న హెచ్ జి ఐ ఈ ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్ట్ సంస్థ మేనేజర్ లక్ష్మి కుమార్ సారధ్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించి ప్రారంభానికి సిద్ధం చేశారు. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్, తాహసిల్దార్ కార్యాలయ భవనాలు ప్రారంభం కానుండడంతో హెచ్ జి ఐ ఈ ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ సంస్థ అందించిన సహకారాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement