Wednesday, April 17, 2024

Maha Muttaram : రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మహా ముత్తారం ( ప్రభ న్యూస్ ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని అలుగు వాగు మూలమలుపు వద్ద కాటారం_ మేడారం ప్రధాన రహదారిపై మోటార్ సైకిల్ ,టాటా ఏస్, కారు ఢీకొన్నాయి.ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు..కాగా మరో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మహా ముత్తారం మండలంలోని కొర్లకుంట గ్రామానికి చెందిన చీరాల అశోక్ (32 ),మరొకరు గోదావరిఖని అడ్డగుట్టపల్లికి చెందిన చిల్ల సమ్మక్క( 65) అడ్డగుట్ట పల్లికి చెందిన ఊర శ్రీశైలం ,మూట రాజేశ్వరి లు తీవ్రంగా గాయపడ్డారు చికిత్స నిమిత్తం వీరిని మహాదేవపూర్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల కథనం ప్రకారం కొర్లకుంటకు చెందిన చీరాల అశోక్ మీసేవ పనుల నిమిత్తం మహాముత్తారం మండల కేంద్రానికి బైక్ పై వెళ్లి వస్తుండగా, గోదావరిఖని అడ్డగుట్టపల్లికి చెందినవారు ములుగు జిల్లా మంగపేటలోని తమ బంధువుల ఇళ్లలో జరిగే పెళ్లికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement