Thursday, May 2, 2024

కిరాణం షాపులపై పోలీసుల దాడులు.. నిషేధిత అంబర్, గుట్కాలు స్వాధీనం..

చిట్యాల, ప్రభన్యూస్ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని పలు కిరాణం షాపులపై గురువారం చిట్యాల పోలీసులు సిబ్బందితో దాడి చేసి నిషేధిత గుట్కా, అంబర్ ప్యాకెట్ లు స్వాధీనం చేసుకొని పలువురు పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ గౌడ్ తెలిపారు. చల్లగరిగ జూకల్ తిరుమలాపురం మండల కేంద్రంలోని కిరాణా షాపులో తనిఖీలు చేయగా..

ఆ షాపులో నిషేధించబడిన అంబర్, గుట్కా ప్యాకెట్లు లభించాయి.. దాంతో ఈ ప్యాకేట్లను స్వాధీనం చేసుకొని పలువురిపై కేసు నమోదు ఫుడ్ ఇన్స్పెక్టర్ అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామాల్లో అక్రమంగా నిషేధిత, అంబర్, గుట్కా, గుడుంబా, విక్రయిస్తే విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్ ఐ కృష్ణ ప్రసాద్ గౌడ్ హెచ్చరించారు.ఈ దాడుల్లో సెకండ్ ఎస్సై షా ఖాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement