Friday, May 3, 2024

వానరానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వానరానికి పోలీసులు అంత్యక్రియలు చేసిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు ఎదురుగా జాతీయరహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వానరం మృతి చెందింది. దీంతో పోలీసులు మానవత్వాన్ని చాటే విధంగా వానరానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతి చెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించిన ఏఎస్సై కోలా శ్యాంసుందర్, హెడ్ కానిస్టేబుల్ చిట్టి బాబు, కానిస్టేబుల్ దయాకర్ పోలీసులను పలువురు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement