Sunday, April 28, 2024

TS: వేట‌గాళ్లు చిక్కారు…ముగ్గురు నిందితుల‌ అరెస్టు..

కరెంట్​వైరు తగిలి గ్రేహౌండ్స్​ కానిస్టేబుల్​చనిపోయిన ఘ‌ట‌న‌లోని వేట‌గాళ్లు పోలీసుల‌కు చిక్కారు. ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు త‌ర‌లించారు.

కాటారం సీఐ నాగార్జునరావు కథనం ప్రకారం..కాటారం మండల కేంద్రానికి చెందిన ఊదరి రమేశ్, గోగుల రమేశ్, గజ్జెల శ్రీనివాస్​కూలీలు. డబ్బులు సరిపోకపోవడంతో జంతువులను కరెంట్​షాక్​పెట్టి చంపి మాంసం అమ్ముతూ బతుకుతున్నారు. ఈనెల11న అడవిలో వీరు అమర్చిన కరెంట్​తీగలకు తగిలి కూంబింగ్​కు వచ్చిన ఆదిలాబాద్​జిల్లా నార్నూల్​మండలం రాజోలిగూడకు చెందిన గ్రేహౌండ్​ కానిస్టేబుల్​ ఆడే ప్రవీణ్​ చనిపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్​చేసి రిమాండ్​చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement