Monday, April 29, 2024

TS: చిక్క‌డ‌ప‌ల్లిలో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌…

హైదరాబాద్‌లోని చిక్క‌డ‌ప‌ల్లిలో ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. చిక్కడపల్లి ఎస్ఎస్ఆర్ గర్ల్స్ హాస్టల్‌లో శిరీష అనే యువతి సూసైడ్ చేసుకుంది. ఇక ఈ సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అనంతరం ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

మృతురాలు శిరీష మహబూబాబాద్ జిల్లా వాసిగా గుర్తించారు పోలీసులు. మానసిక ఒత్తిడి లేక ప్రేమ విఫలం కారణంగా యువతి సూసైడ్ పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు చిక్కడపల్లి పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు చిక్కడపల్లి పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement