Sunday, April 28, 2024

Phone Tapping Case: హైకోర్టులో ప్రణీత్‌రావుకు చుక్కెదురు

తెలంగాణలో ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రణీత్‌ రావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో, ఆయనకు బిగ్‌ షాక్‌ తగిలినట్టైంది. కాగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న(బుధవారం) వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెల్లడించాల్సి ఉండగా.. గురువారం ప్రణీత్‌ రావు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కిందిస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement