Tuesday, April 30, 2024

Peddapalli : కార్పొరేట్ స్ధాయిలో ప్రభుత్వ పాఠశాలలు.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి (ప్రభ న్యూస్) : ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు కల్పించామని పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీతా సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో మన ఊరు మన బడిలో నూతనంగా పాఠశాల ఆధునీకరణ చేపట్టారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ.. కార్పొరేట్ స్ధాయిలో పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపడ్డాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల మల్లేశం, జిల్లా విద్యాధికారి మాధవి, ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, జెడ్పీటీసీ బండారి రాంమూర్తి, రఘువీర్ సింగ్, ఎంపీటీసీ నిర్మల శ్రీనివాస్, ఎంపిడిఓ రాజు, మండల విద్యాధికారి సురేందర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement