Saturday, April 27, 2024

Peddapalli – పేదలకు వరం సీఎంఆర్ఎఫ్ .. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్ద‌ప‌ల్లి – అనారోగ్యాల బారినపడి వైద్యం చేయించుకున్న పేదల పాలిట సీఎంఆర్ఎఫ్ వరంల నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో పెద్దపల్లి నియోజకవర్గంలోని 88 మంది లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 33,74,388 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. ప్రభుత్వాసుపత్రాలను బలోపేతం చేసి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుందన్నారు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ కిట్టు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమితి కో ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఎంపీపీ లు,జడ్పీటీసీ లు,మండల పార్టీ అధ్యక్షులు ,మున్సిపల్ చైర్ పర్సన్ లు, ఛైర్మెన్ లు,డైరెక్టర్ లు,పట్టణాధ్యక్షులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు, కౌన్సిలర్ లు,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో ఆప్షన్ లు,ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement