Friday, May 3, 2024

Peddapalli – గులాబీ జెండా నిరుపేదలకు అండ – ఎమ్మెల్యే దాసరి

గులాబీ జెండా నిరుపేదలకు అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన మైనారిటీ యువకులు ఆరిఫ్, ఇమ్రాన్, సల్మాన్, వాసీం, సఫీ ఉద్దీన్, అలీం, ఇమ్రాన్, బబ్లూ లు బిఆర్ఎస్ లో చేరగా కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సంక్షేమం భారత రాష్ట్ర ప్రభుత్వమే సాధ్యమని, ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.

కెసిఆర్ భరోసాతో ప్రజలందరూ బిఆర్ఎస్ వైపే నిలుస్తున్నారని, రాష్ట్రంలో మరోసారి కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని పెద్దపల్లిలో సైతం గులాబీ జెండా ఎగురుతుందన్నారు. కాంగ్రెస్ దొంగ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, మరోసారి భంగ పాటు తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు,మార్కెట్ ఛైర్మెన్ బుర్ర మౌనిక – శ్రీనివాస్, వైస్ ఛైర్మెన్ అన్నేడి మహిపాల్ రెడ్డి, బీసీ మండలాధ్యక్షుడు గరిగంటి కుమార్ బాబు, సర్పంచ్ గడ్డం వసంత – మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆవుల వెంకటేష్, గ్రామ శాఖ అధ్యక్షులు నల్లంగి సదయ్య, అన్నేడి నిశాంత్ రెడ్డి, తడిగోప్పుల శ్రీనివాస్, నాగరాజు, ఈసారపు రమేష్ ,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement