Sunday, May 19, 2024

పెద్దపల్లిలో పట్టణ ప్రగతి ప్రారంభం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని మూడవ వార్డు లో పట్టణ ప్రగతి లో భాగంగా ఇంటింటికి వెళ్లి కాలనీవాసుల ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు నిత్యం జరిగేలా సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్ బిక్షపతి తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement