Sunday, May 19, 2024

Breaking: ప్రియాంక గాంధీకి కరోనా

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. గురువారం ఆమెకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఈరోజు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ కూడా కోవిడ్‌ బారినపడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. శుక్రవారం చేసిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని ఆమె పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కాంటాక్ట్‌ అయినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement