Sunday, May 19, 2024

నీ అంతు చూస్తా.. రైతుకు బెదిరింపులు

మెదక్ జిల్లా రెగోడ్ మండల సొసైటీ కేంద్రం వద్ద రైతుల నిరసన ఆందోళన చేపట్టారు. 20 రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై నిరసనగా ధాన్యాన్ని రోడ్డుపై పెట్రోలతో కాల్చారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతుల డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై మీడియాకు సమాచారం ఇచ్చాడనే కారణంతో ఓ రైతుపై పీఏసీఎస్ సీఈఓ హఫీజ్ బెదిరింపులకు దిగారు. నీ అంతు చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement