Saturday, May 18, 2024

అనుచిత వ్యాఖ్యలు చేస్తే పార్టీ నుంచి అవుట్‌.. ఆపై క్రిమినల్‌ కేసులు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ పార్టీకి ఐక్యమత్యమే మహాబలమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ”పార్టీలో ముఖ్య నేతలపైన, వివిధ హోదాల్లో ఉన్న నాయకులపైన బహిరంగంగా లేదా సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తే పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరణ చేయడం జరుగుతుంది. క్రిమినల్‌ కేసులు ఎదుర్కోక తప్పదు” అని రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా హెచ్చరించారు.

గతంలో సొంత పార్టీకి చెందిన కొందరు నేతలపైన రేవంత్‌రెడ్డికి అభిమానులమని చెప్పుకునే వారు సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకుని పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement